రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలకేంద్రంలో కృష్ణమూర్తి గారి నివాసంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనిస్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ లో మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కమతం రాంరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. వారితో పాటుగా పాల్గొన్న పరిగి శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి గారు, వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్ రెడ్డి గారు తదితరులు.
Read MoreCategory: Newsbeat
కులగణన సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదు..టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కులగణన సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదు..టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులఘనన ను తప్పులు తడక అంటున్నారు.ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి ఘనన చేయడం జరిగిందని అన్నారు.కులగనన దేశానికే ఆదర్శంగా చేపట్టము.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందికులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని చెప్పారు. 1931 తర్వాత కులఘనన జరిగింది ఇది బీసీ లకు ఎంతో మేలు జరుగుతుంది.పక్కాగా పకడ్బందీగా కులఘనన ను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను…
Read Moreవైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే వేదపారాయణములు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్ఠానములు గావింపబడినవి. అనంతరం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలలో భాగంగా హవనము, మరియు శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి సింహవాహన శేవలో ఊరేగింపు వేడుకమ ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలలో ఆలయ అనువంశికధర్మకర్త శ్రీ బి.నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎ. భాస్కర్ రావు గారు, ఉపకార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి. సింహవాహన శేవ ప్రత్యేకత..బ్రహ్మోత్సవ వాహన శేవలలో ఎంతో ప్రత్యేకత కలిగినది సింహవాహన శేవ మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్ వచనము జంతువులలో మృగేంద్రము…
Read Moreమోదీ అభివృద్ది గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారు..ఎంపీ డీకే అరుణ
గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి కి అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లోవారు మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పై సెటైర్లు వేశారు. పదేళ్లలో పాడు చేశారు…గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అద్వాన్నంగా తయారైయిందని,అభివృద్దే అజెండాగా అక్కడి ప్రజలు మార్పు కోరుకుని స్వయంగా ప్రచారం చేశారు అని చెప్పారు.గొప్ప విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖేల్ ఖతం….కాంగ్రెస్ ను ఇక నమ్మే పరిస్థితి లేదు,కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది గతంలో అధికారం లో ఉన్నా కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు.ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ విఫలం అయ్యారు అని విమర్శించారు. ఇక్కడేమి చేతగాక….తెలంగాణలో 420 హామీలు…
Read Moreపండుగ సాయన్న ముదిరాజ్ మరియు పూలే విగ్రహా ఆవిష్కరణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి..మంత్రి సీతక్క
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి 10 యేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండురైతును రాజు చేయాలన్న లక్ష్యం తో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసింది రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ములుగు జిల్ల , ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. దనసరి అనసూయ సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న…
Read Moreశ్రీస్వామి వారి ఆదాయము
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.
Read Moreరేషన్ కార్డులకు లైన్ క్లియర్..
ప్రజలు తమ సమీపంలోని మీసేవ కేంద్రాలలో ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ దీనికి గడువు ఏమీ లేదని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Read Moreఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది..ఎమ్మెల్యే మందుల సామేలు..
ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బన్నాల..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బన్నాల.. ఉప్పల్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గార్లపై మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై, ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరినట్లు తెలిపారు.
Read More