పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …

పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు … యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు

Read More

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…

Read More

యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్

యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్ యాసంగి(రబీ) 2024-25 కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరుగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ గురించి సన్నాహక సమావేశం రాయగిరిలోని లింగ బసవ గార్డెన్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.…

Read More

జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన ఏడుగురు కుంభమేళా కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి కి గురయ్యానని తెలిపారు.మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మృతులకు తన సంతాపం ప్రకటించారు. బాధితులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Read More

బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం

బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూస్తూనే సోషల్ మీడియాలోబీఅర్ఎస్ పార్టీ అబద్దాలు ప్రచారంచేస్తోంది అని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడారు .రాష్ట్రము లో అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నము ,రైతు రుణమాఫీ చేశాము కొన్ని సాంకేతిక కారణాల వల్లా ఒకరి ఇద్దరికి రాక పోతే అదికూడా త్వరలో వస్తుందని అన్నారు .రాష్ట్ర బడ్జెట్లో 60 వెల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నము.మూసి ప్రక్షాళన చేసి సాగుకు స్వేచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో గెలుస్తాము.ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ధైర్యం…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ జనాభాపరంగా ముదిరాజుల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ముదిరాజుల బ్రతుకులు మారడం లేదని ,ముదిరాజులు రాజ్యాధికారం అందుకోలేకపోతున్నారని గత 78 సంవత్సరాల నుంచి ఒక్క జడ్పిటిసి గెలవలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ ముదిరాజ్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య మాట్లాడుతూ…ముదిరాజుల ఐక్యమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పరస్పరం గౌరవాలు ఆప్యాయతలు పెంచుకోవాలని సూచించారు. ప్రముఖ కవి రచయిత బోల యాదయ్య మాట్లాడుతూ…తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులను ఐక్యమత్యం చేస్తూ జండా కార్యక్రమాలు చేస్తూ ముదిరాజులు…

Read More

మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..

Read More

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలమినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రిఅనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని,…

Read More