ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
Read MoreCategory: Leaders
నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా విజయం సాధించి చట్టసభలో అడుగుపెడుతున్న వీరభత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లకు ఎంపీ మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి పట్టం కట్టారని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి…
Read Moreయంగ్ ఇండియా కె బోల్ యువతకు మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ ..డా:కోట నీలిమ
ఏఐసీసీ ఇంచార్జి నటరాజన్ గారిని కలిసిన.. జక్కిడి శివచరణ్ రెడ్డి.
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ గురించి చర్చించారు.త్వరలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మీనాక్షి నటరాజన్ తెలిపారని శివచరణ్ రెడ్డి అన్నారు.
Read Moreబి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో విపత్తు సంఘటనలు సందర్భాలలో మంత్రులు సంఘటన స్థలం లో ఉన్నారా?కనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు.మా ప్రభుత్వం లో సంఘటన జరిగిన రెండు గంటల లోపే సంబంధిత శాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు,ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై సమీక్ష చేశారు.అయినా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా. కోట నీలిమ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చెమ్ముతూ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.విపత్తులు సంభవించినప్పుడు విపక్షాలు రాజకీయాల కతీతంగా అందరూ ఏకమై సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి అని అన్నారు. నల్గొండ జిల్లాలో…
Read Moreఎస్సీ వర్గీకరణ చేసినందుకు కృతజ్ఞతలు ..పులిగిల్ల బాలయ్య
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య. గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె…
Read Moreమాజీ మేయర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి రవి
మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన రవికుమార్, హీరేకర్ శ్రీను
ది ఈగల్ న్యూస్ : భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
Read Moreఅనాధాశ్రమాన్ని సందర్శించిన ..TMMS రాష్ట్ర కన్వీనర్ డా: గుండ్లపల్లి
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరం లో గల భగవాన్ బాబా అనాథాశ్రమం ను కారా మాజి చైర్మన్ మంద రాంచంద్రారెడ్డి మరియు మాజీ సభ్యులు హైకోర్ట్ అడ్వకేట్ శ్రీమతి రేణుక గూలే గార్లతో కలిసి అనాధాశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా:గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్.
Read Moreఆశిర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా..దొడ్ల వెంకట్
ది ఈగల్ న్యూస్ : సంగారెడ్డి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దొడ్ల వెంకట్ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ కాలేజీలలో విస్తృత ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు,విద్యావంతులు ఉపాద్యాయులు పెద్ద మనస్సుతో ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పారు.బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులని ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోల్ల రామ్ రెడ్డి, రుమాండ్ల మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More