మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమైన పార్టీ ప్రముఖులు.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ప్రముఖులతో సమావేశమయ్యారు.ఏప్రిల్ నెలలో పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా జరిగిన ఈ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు,జగదీష్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్,శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో పార్టీ నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,తాతా మధు, దేశపతి శ్రీనివాస్,…

Read More

ఏఐసీసీ ఇంచార్జి నటరాజన్ గారిని కలిసిన.. జక్కిడి శివచరణ్ రెడ్డి.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ గురించి చర్చించారు.త్వరలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మీనాక్షి నటరాజన్ తెలిపారని శివచరణ్ రెడ్డి అన్నారు.

Read More

బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో విపత్తు సంఘటనలు సందర్భాలలో మంత్రులు సంఘటన స్థలం లో ఉన్నారా?కనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు.మా ప్రభుత్వం లో సంఘటన జరిగిన రెండు గంటల లోపే సంబంధిత శాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు,ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై సమీక్ష చేశారు.అయినా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా. కోట నీలిమ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చెమ్ముతూ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.విపత్తులు సంభవించినప్పుడు విపక్షాలు రాజకీయాల కతీతంగా అందరూ ఏకమై సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి అని అన్నారు. నల్గొండ జిల్లాలో…

Read More

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణోత్సవం.

ది ఈగల్ న్యూస్ : తెలంగాణ బ్యూరో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి…

Read More

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు గౌర్నర్ కు ఆహ్వానం

Invitation to Governor for Yadadri Brahmotsavam

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.

Read More

ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కృతజ్ఞతలు ..పులిగిల్ల బాలయ్య

Thank you for the SC classification..Puligilla Balayya

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య. గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె…

Read More

మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన రవికుమార్, హీరేకర్ శ్రీను

Ravikumar and Heerekar Srinu who participated in the Kalyanam of Mallikarjuna Swami and performed special pujas.

ది ఈగల్ న్యూస్ : భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

Read More