ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ 19 న అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి27 న ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ ఈ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగా ,ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు.సమావేశాలకు హాజరైన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ .రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం ,14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు,15వ తేదిన ధన్యవాద తీర్మాణంపై చర్చ16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు,17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ,18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టనున్న ప్రభుత్వం,20న అసెంబ్లీకి సెలవు,21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ27 వరకు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
Read MoreAuthor: Eagle News
నిరుద్యోగులకు అండగా.. ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండగ.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండగ అనిఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో జరిగిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 1,292 మంది, జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా బలమూరి వెంకట్ మాట్లాడుతూ .. 12 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్,12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పారు.మొన్న గ్రూప్-1, నిన్న గ్రూప్-2 ఉద్యోగాల ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ,55 రోజుల్లోనే ఉపాధ్యాయ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను కల్పించాం అని అన్నారు.12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు కల్పించిన ఘనతరేవంత్ సర్కార్ డి…
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర ..చనగాని దయాకర్
ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర అని ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 ,గ్రూప్ 2 నూతన అభ్యర్థులు ప్రజా పాలనలో భాగం కావాలని పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని చెప్పారు.దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది…
Read Moreప్రపంచం తో పోటీపడే విదంగా సమీకృత గురుకులాలు..కోట నీలిమ
మంత్రి లోకేష్ కు అడుగడుగునా జన నీరాజనం
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ శ్రీ సత్యసాయి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ పర్యటన…
Read Moreకేతావత్ శంకర్ నాయక్
పేరు:కేతావత్ శంకర్ నాయక్ తండ్రి పేరు:వీర్య నానా పుట్టిన తేదీ:15-04-1972 మతం:హిందూ కులం : S.T. ఉప-కులం:లంబాడా వృత్తి:వ్యవసాయం నియోజకవర్గం : మిర్యాలగూడ చిరునామా : కేతావత్ తండా, దిలావర్పూర్ పోస్ట్, దామరచర్ల మండలం నల్గొండ జిల్లా – 508207 మొబైల్: 9440102390 రాజకీయ నేపథ్యం: దామరచర్ల మండల మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా 1998 నుండి 2001 వరకు పనిచేశారు. Z.P.T.C.గా ఎన్నికయ్యారు. 2001 జనరల్ సీటు దామరచెర్ల మండలంలో. 2006 నుండి 2011 వరకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (MPP) ఎన్నికయ్యారు, దామరచర్ల మండలం జనరల్ సీటులో. 2011 నుంచి 2014 వరకు దామరచర్ల మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. దామరచర్ల మండలంలో 2014 నుండి 2019 వరకు. 2016 నుండి 2019 వరకు మిర్యాలగూడ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా…
Read Moreఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్ మహేష్
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…
Read Moreగరిమెళ్ళ మృతికి సంతాపం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ తిరుమల, తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడుగరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యమరియు ఐటి శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్.గరిమెళ్ళ మృతి చెందారనే వార్త బాధ కలిగించిందాని తెలిపారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ గారు,600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన శ్రీ గరిమెళ్ళ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గరిమెళ్ళ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు.
Read Moreఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు వీరే..
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది .కాంగ్రెస్ పార్టీ కి అసెంబ్లీ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ను బట్టి నాలుగు స్తనాలు రానుండగా దాంట్లో ఒక స్తానం మిత్ర పక్షం అయిన సిపిఐ కి కేటాయించింది .మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ , నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ,విజయశాంతి ల పేర్లు ఏఐసీసీ ప్రకటించింది.
Read Moreరేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన
ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు…
Read More