స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి..మంత్రి సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి

10 యేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండు
రైతును రాజు చేయాలన్న లక్ష్యం తో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసింది

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

ములుగు జిల్ల , ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. దనసరి అనసూయ సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంతరెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుంన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. నేను మంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు ములుగు నియోజక వర్గం లో సుమారు 30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సిసి రోడ్స్ డ్రైనేజీలు కల్వర్టు లు మంజూరు చెయ్యడం జరిగిందని అదే విధంగా ములుగు నూతన బస్ స్టాండ్ ఏటూరు నాగారం లో బస్ డిపో కు నిధులు 80 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్మెంట్ పంచాయితీ రాజ్ శాఖ నుండి బిటి రోడ్లకు సుమారుగా 310 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని ఇలా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని
నాయకులకు కార్యకర్తలకు మధ్యలో విభేదాలుంటే నా ద్రుష్టికి తీసుకురావాలిని సీతక్క అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఎక్కడా మాట్లాడకూడదు పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేయడం కోసం అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలి పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక సంస్థలలో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అని
రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. భూమి లేని రైతు కూలీలను అధ్వానంగా చూశారని, రూ.కోట్లు ఉన్న ఆసాములకు మాత్రం రైతు బంధు సాయం ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉన్నట్లుందని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts