ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం ఏర్పాటు చేస్తాం… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్బంగా నిర్వహించిన బహిరంగసభలో పాల్కొని మాట్లాడారు.

సీఎం దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన దానశీలురు రతన్ టాటా అని కొనియాడారు.వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయిని అన్నారు.
టాటా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. స్కిల్ సెంటర్స్ ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాంఅని అన్నారు.వారి సేవాతత్పరథకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ ఆదిభట్లలో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఎన్.హెచ్-65 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర జాతీయ, రాష్ట్ర రాహదారులు మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషించబోతున్నాయి అని చెప్పారు. గ్రామసభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తున్నాం అని అన్నారు.మా సంక్షేమ కార్యక్రమాలు చూసి కేటీఆర్, హరీష్ రావుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ సంక్షేమం వల్ల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరిచిపోతరని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.మేం విమర్శలను పట్టించుకోం, న్యాయమైన సలహా ఎవ్వరు ఇచ్చినా స్వీకరిస్తాం అని చెప్పారు.

గ్రామసభలు నిరంతరం జరుగుతాయి…..

గ్రామసభలు ఈ వారం రోజులతో అయిపోయేది కాదు, నిరంతర ప్రక్రియ, ఇవ్వాల సభ అయిపోతే ఎట్లా అనే ఆందోళన అవసరం లేదు. రేషన్ కార్డులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఏర్పాటు చేశామని ప్రజలకు భరోసానిచారు.మాది మానవీయమైన సర్కారు. ప్రతీపేదకు సన్నబియ్యం ఇస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Related posts