నిరుద్యోగుల పక్షాన పోరాడుతా..అవకాశం ఇవ్వండి.. దొడ్ల వెంకట్
కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీ ఓటుకు అర్థమే ఉండదని, నిరుద్యోగుల తరుపున పోరాడే అవకాశం ఒక్కసారి ఇవ్వండి అని పట్టభద్రుల MLC అభ్యర్థి దొడ్ల వెంకట్ అన్నారు.మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రజాశక్తి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా దొడ్ల వెంకట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఈ సందర్బంగా దొడ్ల వెంకట్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతూ… ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్టే అవుతుందని,అలాగే బిజెపి అభ్యర్థి ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు అలాంటికి వ్యక్తికి ఓటు వేయడం శుద్ధ దండుగని అన్నారు. దయచేసి నిరుద్యోగుల పక్షాన పోరాడడానికై పట్టభద్రులు,ఉపాధ్యాయులు నన్ను నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి వారికి న్యాయం చేస్తానని అన్నారు. పట్టభద్రులు ఓటు అమ్ముకునే సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించాలని ఇది ఒక అదృష్టంగా భావించాలని నిజాయితీ కలగినటువంటి వారికి నిజాయితీగా ఓటు వేస్తే పట్టభద్రుని ఓటుకు చాలా విలువ ఉంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సందీప్,సయ్యద్ రషీద్,అనిల్.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.