తెలంగాణ ఉద్యమం లో (22 మార్చి) నేటి సంఘటనలు

జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమ యాత్ర రెండవ రోజు భద్రాచలంలో ప్రారంభమై పాల్వంచ కొత్తగూడెం ఇల్లందు బయ్యారం తదితర ప్రాంతాల మీదుగా ఖమ్మం చేరుకుంది.

సడక్ బంద్ సందర్భంగా గురువారం తెలంగాణ ఉద్యమ నాయకులను తెలంగాణ వాదులను అరెస్టు చేసి జైలలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పది జిల్లాల్లో నిరసన హోరెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలను నిర్వహించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిజామాబాద్ జిల్లా మహాసభ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.

Related posts