The Eagle News యాదాద్రి :
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, నాతాలగూడెం గ్రామం లో జరిగిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు.
ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…
నీళ్లు,నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాల పాలన ఒక నియంత పాలన జరిగింది. గత సీఎం కనీసం సెక్రటేరియట్ కు రాకుండా మంత్రులను కలవకుండా దుర్మార్గం పాలన చేశారు.ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలనేదే ప్రజాపాలన లక్ష్యం అన్నారు.పట్టుదల,చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది,ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మా లక్ష్యం అని చెప్పారు.
కానీ ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నాయి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి,వ్యవసాయానికి యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలని, భూమిలేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందుతాయి ఎవరు నిరాశ చెందవద్దు అని,లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
గ్రామ సభలు పెట్టిందే చర్చ చేయడానికి దానిని కూడా ప్రతిపక్షాలు తప్పతో పట్టించి రాద్ధాంతం చేస్తున్నాయి.నిజమైన లబ్ధిదారులు లిస్టులో పేరు రాకపోవడం వల్ల నిరాశ చెందొద్దు దానికి అధికారులు సరిచేసి మీకు పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటారు.

