యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్ యాసంగి(రబీ) 2024-25 కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరుగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ గురించి సన్నాహక సమావేశం రాయగిరిలోని లింగ బసవ గార్డెన్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.…
Read More