- తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక తీపి కబురు చెప్పింది
- ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డులో పేరు మార్పులు చిరునామా మార్పులు ఇతర మార్పులు అవసరమైన వాటిని కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చని కీలక ప్రకటనలో తెలిపింది.
ప్రజలు తమ సమీపంలోని మీసేవ కేంద్రాలలో ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ దీనికి గడువు ఏమీ లేదని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.