విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్

విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులకు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా,మోత్కూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో ఈనెల 5నుండి ప్రారంభమైన ధ్వజ స్తంభం,నవగ్రహ,వీరభద్ర,కాల భైరవ,పార్వతీ దేవి, జంట నాగుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులు పాల్గొని రామలింగేశ్వర స్వామికి ,దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామ చంద్రు గౌడ్ కంచర్ల రామకృష్ణా రెడ్డి- పద్మ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శివ మాల ధారులు,ఆలయ కమిటీ ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.

Related posts