The Eagle News సూర్యాపేట
76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డి గూడెం మండలం,అడివెంల గ్రామం లోని పాఠశాలలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, రేఖ చారిటబుల్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి డా. రేఖ బోయలపల్లి.
ఈ సందర్బంగా రేఖ బోయలపల్లి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో ముఖ్య అతిధిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చాలా సంతోషంగా ఉందన్నారు. రేఖా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అంద చేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్, మాజీ సర్పంచ్ మడ్డి పద్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయురాలు యాదమ్మ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు,గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.