ఊరు వాడ ఘనంగా హోలీ సంబరాలు

హోలీ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా ఊరు వాడలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ,తెలుగు రాష్ట్రాల మంత్రుల తో పాటు ముఖ్య నాయకులు, ప్రముఖులు ,కార్యకర్తలు రంగులు చల్లుతూ డాన్సులు చేస్తూ ప్రజలతో కలిసి ఆనందంగా హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రెండు తెలుగు రాష్ట్రాల పలువురు మంత్రులు .తెలంగాణ రాష్ట్ర రవాణ మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి లోకేష్ కుమార్ ,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ హోలీ పండుగ ,రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాలు సంబరాలు నింపాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి లో హోలీ సంబరాలలో పాల్గొన్నారు.చిన్ననాటి మిత్రులతో కలిసి కాముని దహన కార్యక్రమంలో పాల్గొన్నారు.డప్పు కొట్టి మిత్రులు అభిమానులతో కలిసి డాన్సు చేశారు.

Related posts