ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండగ అని
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో జరిగిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.1,292 మంది, జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సందర్బంగా బలమూరి వెంకట్ మాట్లాడుతూ ..
12 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్,12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పారు.మొన్న గ్రూప్-1, నిన్న గ్రూప్-2 ఉద్యోగాల ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ,55 రోజుల్లోనే ఉపాధ్యాయ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను కల్పించాం అని అన్నారు.12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత
రేవంత్ సర్కార్ డి అని అన్నారు. రాబోయే రోజులలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.