మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క
- భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అలెర్ట్ గా ఉండాలి
- స్నాన ఘట్టాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన మంత్రి సీతక్క
- వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల
మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రి
అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రంచేయించాలని భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలుతీసుకోవాలని అని అన్నారు.నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామనిచెప్పారు.దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని మంత్రి గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.
