76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నల్గొండ జిల్లా కేంద్రం లోని సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్, యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థుల ఆహ్వానం మేరకు పూర్వ విద్యార్థి & గౌరవ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు చేసిన సంస్కృతి కార్యక్రమాలు ఆసక్తిగా తిలకించారు.క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో డైమండ్ జూబ్లీ అల్యూమిని అసోసియేషన్ సభ్యులు, SAHS యొక్క మొదటి బ్యాచ్ (1965) శ్రీ. పి. వెంకటేశం A.E.గారు, పూర్వ విద్యార్థులు,పాఠశాల ప్రిన్సిపల్, పాఠశాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.


