ది ఈగల్ న్యూస్: హైదరాబాద్
శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 05 గంటలకు సికింద్రాబాద్ చేరుకొని పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఇందిర మహిళాశక్తి కార్యక్రమంలో పాల్గొంటారు
అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు బంజారాహిల్స్ లోని నివాసానికి చేరుకుంటారు.